పెట్రోల్ రేట్లు కొంత కాలంగా మండిపోతున్నాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా పెట్రోల్ రేట్లు లీటర్కు సెంచరీ దాటిపోయింది. డీజీల్ పరిస్థితీ ఇంచుమించు అంతే. అందుకే ఈ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం చేపట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో ఈ అవకాశం కల్పించింది.
విషయం తెలియగానే వాహనదారులు బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. సుమారు 1200 మందికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందించారు. మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులకు బారులుతీరారు.
డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 500 మందికి ఇవ్వాలనుకున్నా, జనం భారీగా రావడంతో దీన్ని కొనసాగించామని యోగేశ్ తెలిపారు. మహారాష్ట్రలోనే అంబర్నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్బంక్లో లీటరు పెట్రోల్ రూ.50కే అందించారు. మోడీ సర్కారు మాత్రం పెట్రోధరలను పెద్ద ఆదాయ వనరుగానే చూస్తోంది.
పెట్రో ధరలపై కేంద్రానికి లభించే ఆదాయం ఆరేళ్లలో 300 శాతం పెరిగింది. ఈ లెక్కలు సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి రూ.2.94 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందట.