పెళ్లి జరిగి ఏడాది కూడా కాకముందే ఆ తల్లికి ఎన్నో కష్టాలు స్వాగతం పలికాయి. భార్యా పిల్లలతో కలకలం సుఖంగా ఉంటుందనుకుంటే కన్న కూతురు ఇలా చేస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు..ఇంతకు ఆ వివాహిత చేసిందేంటి? కన్న తల్లి తండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చటానికి కారణమేంటో అసలు నిజాలు తెలుసుకుందాం.
అది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఒత్కులపల్లి గ్రామం. జుమ్మిడి లక్ష్మి, రాజమలకు జన్మించింది దుర్గం రమ్య. పెంచి పెద్ద చేసి భీమారంమండలంలోని నర్సింగాపూర్కు చెందిన దుర్గం శేషమ్మ, భూమయ్య దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్కు ఇచ్చి గతేడాది ఘనంగా వివాహం చేశారు. వరుడు బంధువుల కోరిక మేరకు కట్నకానుకలు కోరిన అంత ఇచ్చారు. అలా కొన్నాళ్లు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోతోంది.
ఈ నేపథ్యంలో రమ్య ఎనిమిది నెలల గర్భాన్ని దాల్చింది. కానీ భర్త రాజశేఖర్కు మాత్రం భార్యను అదనపు కట్నం కోసం రోజు వేధించటం మొదలు పెట్టారు. ఇక ఆ యువతి దిన దిన గండంగా భర్త పోరును భరించుకుంటూ వస్తోంది. అత్తింటివాళ్లు ఇంతటితో ఆగకుండా శారీరకంగా, మానసికంగా వేధించటం మొదలు పెట్టారు. ఇక భర్త కుటుంబ సభ్యుల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఏం చేయాలో తెలియక ఆ యువతి తనలో తాను కుమిలిపోతు చివరికి ఆత్మహత్యే శరణ్యమని భావించింది.
ఇలాంటి కష్టాలు నాకు పుట్టబోయే బిడ్డకు రాకూడదని భావించింది. ఇక గురువారం అర్థ రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన భర్త అత్తమామలతో సహా పరారిలోకి వెళ్లారు. ఇదే విషయం రమ్య తల్లిదండ్రులకు తెలియటంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట మొదలు పెట్టారు.