అడపా దడపా మత్స్యకన్యలను చూసినట్లు కొందరు చెబుతూ వచ్చారు. కానీ మత్స్య కన్యలకు చెందిన నిజమైన ఫొటోలు గానీ, వీడియోలు కానీ లేవు. అందువల్ల మత్స్య కన్యలు అనేవారు ఊహాజనితమైన వారని కొందరు అంటుంటారు. ప్రపంచంలో చాలా రహస్యాలు, పరిష్కరించని రహస్యాలు ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు ఇంకా దొరకడంలేదు. మత్స్యకన్యల వల్ల అదృష్టం వస్తుందని, సముద్రంలో అంతు లేని సంపదను దాస్తారని చెబుతారు. కానీ వారి వల్ల చెడు జరుగుతుందని కొన్ని వర్గాల వారు నమ్ముతారు. నిజ జీవితంలో మత్స్యకన్యలు ఎలా ఉంటాయో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.ఇక మత్స్యకన్యలు అవసరం అయితే పూర్తిగా మానవరూపం కూడా ధరించగలరని, వారు పైన సగం మనిషి, కింద సగం చేప ఉన్నా కొన్ని సందర్భాల్లో పూర్తిగా చేపలా లేదా పూర్తిగా మనిషిలా మారగలరని, మనుషులతో వారు సత్సంబంధాలను కలిగి ఉంటారని కొందరు అంటారు. అయితే మత్స్యకన్యలు ఉంటారనడానికి కచ్చితమైన ఆధారాలు లేకపోయినా చరిత్రలో జరిగిన సంఘటనలను బట్టి చూస్తే మత్స్యకన్యలు ఉంటారని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. క్రీస్తుపూర్వం 1,700 లోనే, బాబిలోనియన్లు మానవుడిలాంటి మొండెం మరియు నడుము క్రింద ఉన్న చేపల తోకతో దేవుడిని ఆరాధించారు.
జపాన్ నుండి మధ్యయుగ స్కాట్లాండ్ వరకు, దక్షిణాన చిలీ నుండి ఉత్తరాన అలస్కా వరకు, ప్రపంచంలోని దాదాపు ప్రతి మహాసముద్రం, నది లేదా సరస్సులో, మత్స్యకన్యలు శతాబ్దాలుగామహాసముద్రాలలో గుర్తించబడ్డారు. ఏదేమైనా మత్స్యకన్యలు ఓ అపురూపమే. ఇవి గ్రహాలు అంతటా వ్యాపించే పురాణాలలో మరియు పురాణాలలో వివరించబడిన అద్భుతమైన జీవులు.
1187వ సంవత్సరంలో ఇంగ్లండ్లోని సుఫ్లోక్ తీర ప్రాంతంలో మత్స్యకన్యను పోలిన వ్యక్తి కనబడ్డాడని ఆధారాలు ఉన్నాయి. 1305, 329లలోనూ గ్రిమ్సీ అనే ద్వీపంలో మత్స్యకన్యలు కనిపించారని చరిత్ర చెబుతోంది. 1430లో హాలండ్లో ఈడమ్, వెస్ట్ ఫ్రీస్ల్యాండ్ అనే చోట్ల మత్స్యకన్యలు కనిపించారు.
అలాగే 1492లో క్రిస్టఫర్ కొలంబస్ కూడా మత్స్యకన్యలను చూశాడని ఆధారాలు ఉన్నాయి. 1560లో కొందరు జాలర్లు సెయ్లాన్ తీర ప్రాంతంలో మత్స్యకన్యలతోపాటు ఆ రూపంలో ఉన్న పురుషులను కూడా చూసినట్లు చరిత్ర చెబుతోంది.