కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. రోజు వారి కూలీపై ఆధారపడే జూ ఆర్టిస్టులు, ఇతర 24 విభాగాల అసిస్టెంట్లు రోడ్డున పడ్డ పరిస్థితి. దీంతో వాళ్లందరికీ అండగా కేజీఎఫ్ స్టార్ కరోనా విలయతాండవంలో కన్నడ హీరో యష్ గొప్ప మనసు చాటుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో ఉన్న 3వేల మంది సినీ కార్మికుల సహాయార్థం అభినందించదగ్గ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ షూటింగ్స్, థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. లాక్ డౌన్ విధించడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని సినీ కార్మికులు వాపోతున్నారు. జేబులో చిల్లిగవ్వ లేక, చేద్దామంటే పని లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. వారి గోడు చూసి పలువురు ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ నటులకు గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ పేరుతో సాయం చేశారు. దీంతో సినీ కార్మికులు అల్లాడిపోతున్నారు. అయితే అలాంటి వారిని ఆదుకునేందుకు కేజీఎఫ్ స్టార్ యష్ ముందుకొచ్చారు.
ఈ క్లిష్ట సమయంలో ఇండస్ట్రీలోని 21 విభాగాలలో ఇబ్బందులు పడుతున్న 3000 మంది సభ్యులకు నా సంపాదన నుంచి ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇది ఒంటరిగా పోరాడే సమయం కాదు, కాబట్టి సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు కార్మికులకు తన వంతు సాయంగా ఈ సొమ్ము అందించబోతున్నట్లు తెలిపారు. నేరుగా సినీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయ్యేలా ఆయన చర్యలు తీసుకోనున్నారు. ఈ చిన్న సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు కానీ ఎంతో కొంత ఊరటనిస్తుందని యష్ పేర్కొన్నారు.