Jr NTR: మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట నేపథ్యంలో ఇంట్లోని తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భౌతికదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఉమామహేశ్వరి భౌతికదేహానికి పోస్టుమార్టం పూర్తయిన వెంటనే కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, విదేశాల్లో ఉన్న కూతురు ఇంటికి రావాల్సి ఉండటంతో ఈ రోజు జరగాల్సిన అంత్యక్రియలు కాస్తా బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో దేశం నలుమూలలా ఉన్న ఉమామహేశ్వరి బంధువులంతా ఆమె కడసారి చూపుకోసం తరలివస్తున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ మొత్తం కడసారి చూపు చూసుకుంది.
నిన్న ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, లోకేష్, బాలక్రిష్ణలు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇక్కడ సామాన్య జనం బుర్రల్ని తొలుస్తున్న విషయం ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి వెకేషన్ను ఎంజాయ్ చేయటానికి ఆయన విదేశాలకు వెళ్లారు. జూ.ఎన్టీఆర్కు ఇప్పటికే విషయం తెలిసి ఉంటుంది.
మరి, బుధవారం జరగనున్న మేనత్త అంత్యక్రియల కోసం జూ.ఎన్టీఆర్ వెకేషన్కు గుడ్బై చెప్పి వెనక్కు తిరిగి వస్తారా? రారా?.. ఒక వేళ వచ్చేటట్లయితే ఎంత టైం పడుతుంది? జూ.ఎన్టీఆర్ వచ్చే వరకు అంత్యక్రియల్ని ఆపుతారా? లేదా? అన్నది క్వశ్చన్ మార్క్. మరి, జూ.ఎన్టీఆర్ తన మేనత్త అంత్యక్రియలకు విదేశాలనుంచి వస్తారా? లేదా? అన్నదానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kantamaneni Uma Maheswari: ఉమామహేశ్వరి గొప్ప మనసు.. ఆమె కోరిక మేరకు నేత్ర దానం!