అన్ స్టాపబుల్.. ఇప్పుడు ఎవ్వరి నోట పట్టినా ఇదే మాట. రీజనల్ టాక్ షోగా మొదలై.. పాన్ ఇండియా రేంజ్ లో “ఆహా” అనిపించింది అన్ స్టాపబుల్. తనదైన టైమింగ్ తో బాలయ్య హోస్ట్ గా ఓ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక అన్ స్టాపబుల్ సీజన్-1 ఇప్పుడు ముగింపు దశకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ కి మిగతా గెస్ట్ లు ఎందుకు రాలేదు అని ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బాబాయ్ హోస్ట్ చేస్తున్న షోకి అబ్బాయి జూనియర్ యన్టీఆర్ గెస్ట్ గా ఎందుకు రాలేదు అన్నది నందమూరి అభిమానుల ప్రశ్న. ఈ విషయంలో చాలానే గాచిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. అన్ స్టాపబుల్ రైటర్ బి.వి.ఎస్.రవి తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
“అన్ స్టాపబుల్ కోసం కొంతమంది గెస్ట్ లను అప్రోచ్ అయ్యాము. కొంతమందిని అప్రోచ్ కాలేదు. చిరంజీవి, ప్రభాస్, వెంకటేశ్ వంటి హీరోలు డేట్స్ అడ్జెస్ట్ కాక రాలేకపోయారు. ఈ విషయంలో జూనియర్ యన్టీఆర్ కారణం వేరే. ఆ సమయంలో రామ్ చరణ్, తారక్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మేము అప్రోచ్ అయిన సమయానికి రాజమౌళి కూడా ముంబయిలోనే ఉన్నారు. కానీ.., బాలయ్య మీద ఉన్న గౌరవం కారణంగా ఆ టీమ్ నుండి రాజమౌళి, కీరవాణి గారు షోకి అటెండ్ అయ్యారు. చరణ్, తారక్ మాత్రం అప్పటికే అక్కడ లాక్ అయిపోయారు. కేవలం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కారణంగానే తారక్.. అన్ స్టాపబుల్ షోకి రాలేదని బి.వి.యస్. రవి క్లారిటీ ఇచ్చారు. మరి.. అన్ స్టాపబుల్ సీజన్ 2 కి తారక్ గెస్ట్ గా రావాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.