మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు. సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ కాగా.. మాస్ రాజా రవితేజ, బాబీ సింహా కీలకపాత్రల్లో నటించారు. ఎట్టకేలకు సంక్రాంతి ఫెస్టివల్ ని మెగా ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ గా మార్చేందుకు సినిమాని తక్కువ టైంలో రెడీ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ మెగా ఎంటర్టైనర్.. విడుదలైన ఫస్ట్ ఆట నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
ఈ క్రమంలో ఫ్యాన్స్ మెచ్చే అంశాలన్నీ జోడించి వాల్తేరు వీరయ్యని సిద్ధం చేశాడు డైరెక్టర్ బాబీ. ఒక మెగాస్టార్ ఫ్యాన్ గా బాస్ ని చాలాకాలంగా ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో.. ఆ విధంగా మాస్, క్లాస్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలిపి స్క్రిప్ట్ రాసుకున్నాడని ప్రేక్షకులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. కథలో కొత్తదనం లేకపోయినా.. ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కానీ.. మెగాఫ్యాన్స్ ని ఒకే ఒక విషయంలో వీరయ్య మూవీకి దెబ్బ పడేలా ఉందని అంటున్నారు నెటిజన్స్. సెకండాఫ్ లో డబ్బింగ్ లో ఫాల్ట్ ఉందా లేక మరెక్కడైనా లోపం జరిగిందా తెలియదు. కానీ.. డైలాగ్స్, మ్యూజిక్ సరిగ్గా అర్థం కాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అసలే సినిమాకి హైలీ పాజిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి.. ఆ డబ్బింగ్ లోపాలను సరిచేసి.. లైవ్ డబ్బింగ్ వాయిస్ లను మార్చేస్తే సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉంటుందని అంటున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ సెకండాఫ్ లో డైలాగ్స్, పాటలు సరిగ్గా వినిపించకపోవడం అనేది అంతటా జరుగుతోందా లేక సాంకేతికంగా సమస్య ఏమైనా ఏర్పడిందా అనేది తెలుసుకొని సరిచేస్తే కలెక్షన్స్ పై ప్రభావం పడకుండా ఉంటుందని సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ప్రస్తుతానికి మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ వీరయ్యను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి వాల్తేరు వీరయ్య మూవీ విషయంలో మీ అభిప్రాయాలు, అనుభవాలను కామెంట్స్ లో తెలపండి.