ఈసారి సంక్రాంతి చాలా క్రేజీ క్రేజీగా ఉంది. ఎందుకంటే ఓవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు నందమూరి బాలకృష్ణ.. ఇలాంటి దిగ్గజ హీరోలు తమకు అచ్చొచ్చిన జానర్స్ లో మూవీ చేశారు. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వచ్చిన ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య అదరగొట్టేశాడు. అదే టైంలో ‘వాల్తేరు వీరయ్య’ చిరు వింటేజ్ అవతార్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలా ఇద్దరూ ఒకరంటే ఒకరు అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నారు. ఇక రెండు రోజుల కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఎవరు టాప్ లో నిలిచారు. ఏయే ఏరియాల్లో ఎవరు ఎక్కువ కలెక్షన్స్ సాధించారనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలయ్యని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. జనవరి 12న ‘వీరసింహారెడ్డి’ థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజు రూ 54 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు మాత్రం చాలాచోట్లు వసూళ్ల డ్రాప్ అయినట్లు తెలిసింది. దానికి తోడు అదే రోజు చిరు ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి వచ్చింది. ఇందులో మెగాస్టార్ ఫుల్ వింటేజ్ స్టైల్లో కనిపించడం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. కామెడీ, డ్యాన్స్, యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశాడు. ఈ రెండు మూవీస్ కూడా సక్సెస్ అయినప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం చాలాచోట్ల బాస్ సినిమా ముందంజలో నిలిచింది. అంతెందుకు రెండు రోజుల ఓవరాల్ కలెక్షన్స్ చూస్తే మీకే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది.
ఆంధ్ర-తెలంగాణ మొత్తం రూ 30.60 కోట్లు (రూ 48.20 గ్రాస్) అని సమాచారం.
మొత్తం రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.37.20 కోట్లు (రూ 61.15 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది.
నైజాం: రూ.11.06 కోట్లు
సీడెడ్: రూ.6.68 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.4.01 కోట్లు
ఈస్ట్: రూ.3.56 కోట్లు
వెస్ట్: రూ.2.42 కోట్లు
కృష్ణ: రూ.2.29 కోట్లు
నెల్లూరు: రూ.1.41 కోట్లు
ఆంధ్ర-తెలంగాణ మొత్తం రూ.34.85 కోట్లు (రూ.55.90 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.43.90 కోట్లు (రూ.75.50 కోట్లు గ్రాస్) అని సమాచారం.
మరి ఈ రెండు సినిమాలు ఒకవేళ మీరు చూస్తే.. మీకు ఏది బాగా నచ్చింది. ఏ సీన్స్ నచ్చాయనేది కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.