వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. జూన్ 17న విడుదలయిన ఈ సినిమా మంచి టాక్తో ముందుకెళ్తోంది. మరీ ముఖ్యంగా సాయి పల్లవి నటన చాలా బాగుందని ప్రేక్షకులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు సైతం చెప్పుకుంటున్నారు. మావోయిస్ట్ బ్యాక్ డ్రాప్ లో మంచి ప్రేమ కావ్యాన్ని చోడించి తెరకెక్కించిన ఈ మూవీ విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వచ్చమైన ప్రేమ సినిమాను తెరకెక్కించినందుకు వేణు ఉడుగుల టీమ్ కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Anchor Anasuya: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై! పోస్ట్ వైరల్!
ఇక సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగానే కాస్త వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్ లో సినిమా చూడని అభిమనులు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ విరాటపర్వం ఓటీటీ హక్కులను దక్కించుకుంది. ఇక జూలై 1 నుంచి విరాటపర్వం ఓటీటీలో ప్రసారం కానుందని తాజాగా నెట్ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. ఈ వార్తతో థియేటర్ లో విరాటపర్వం సినిమాను చూడని అభిమానలు ఇప్పుడు ఎగిరిగంతేస్తున్నారు. అయితే విరాటపర్వం మూవీని రూ.15 కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ ఈ రైట్స్ను కొనుగోలు చేసిందని సమాచారం. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
A relentless quest for love and freedom!
Get ready to experience the world of Virata Parvam, coming to Netflix on 1st of July in Telugu, Malayalam and Tamil! #VirataParvamOnNetflix pic.twitter.com/44ks2WaJLl
— Netflix India South (@Netflix_INSouth) June 29, 2022