కొన్నిసార్లు అధిక బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయనే విషయాన్ని పక్కన పెడితే.. సినిమా థియేటర్స్ నుండి వెళ్ళిపోయాక కూడా దాని చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తుంటాయి. ప్రస్తుతం లైగర్ సినిమా విషయంలో అదే జరుగుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. కరణ్ జోహార్, ఛార్మిలతో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు పూరి. అలాగే ఆగష్టులో పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. కానీ.. భారీ అంచనాల మధ్య విడుదలైన లీగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన దర్శకనిర్మాతలతో పాటు హీరో విజయ్ దేవరకొండకి కూడా ఈడీ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. లైగర్ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టినందుకు ఇప్పుడు చిత్రయూనిట్ తలపట్టుకుంటోంది. ఈ సినిమా కోసం బడ్జెట్ ని ఎక్కడెక్కడి నుండి తీసుకొచ్చారని ఈడీ ఆరా తీస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మిలను ఈడీ అధికారులు విచారించారు. కాగా.. ఇదే విషయంపై హీరో విజయ్ దేవరకొండను విచారించేందుకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. దీంతో తాజాగా విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయంలో హాజరయ్యాడు.
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యూనరేషన్, సినిమాకి సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి విచారణ చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. లైగర్ సినిమా కోసం బడ్జెట్ ని విదేశాల నుండి, పలువురు పొలిటిషన్స్ నుండి సేకరించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు ఇండస్ట్రీ టాక్. అందుకే ఈడీ బృందం లైగర్ యూనిట్ ని గ్యాప్ లేకుండా విచారిస్తోందట. మరి ఇప్పటికే సినిమా పోయి, నష్టాలను ఫేస్ చేస్తున్న లైగర్ మూవీ టీమ్ మున్ముందు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయనుందోనని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం విజయ్.. సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు.
#Breaking : Actor #VijayDevarakonda appears before Enforcement Directorate #Hyderabad on Wednesday in connection with FEMA (foreign exchange management act) investigation. ED is investigating alleged payments and sourcing of funds regarding recent multilingual ‘#Liger movie.
— TOI Hyderabad (@TOIHyderabad) November 30, 2022
Actor #VijayDevarakonda appears before the ED in #Hyderabad for questioning in connection with his recently released movie ‘Liger’#BreakingNews #AnanyaPanday pic.twitter.com/qEXK687i6A
— Mirror Now (@MirrorNow) November 30, 2022