Vignesh Shivan: పెళ్లి తర్వాత నయన తార, విగ్నేష్ శివన్ల జంట శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దర్శనం తర్వాత తిరుమల మాఢ వీధులో నయనతార చెప్పులతో తిరగటం పెను దుమారం రేపింది. అంతేకాదు! ఈ జంట ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా మాఢ వీధుల్లో ఫొటో షూట్ సైతం నిర్వహించటంతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నయన తార భర్త విగ్నేష్ శివన్ స్పందించారు. టీటీడీని క్షమాపణలు కోరుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో.. ‘‘ అక్కడ మేము చేసిన పొరపాట్లకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాము. మేము ఎంత గానో ఆరాధించే దేవుడిని అగౌరవ పర్చాలన్నది మా ఉద్ధేశ్యం కాదు.
మేము తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఆ టైంలో 30 రోజుల్లో 5 సార్లు తిరుమలకు వచ్చాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ పెళ్లి చేసుకోలేకపోయాము. అందుకే తిరుమలలో ఇద్దరూ ఫొటోలు దిగి వాటిని ఓ గుర్తుగా ఉంచుకోవాలనుకున్నాము. తిరుమలలోనే మా పెళ్లి జరిగిందని భావించాలనుకున్నాము. తిరుమలలో ఎంతో చక్కగా దర్శనం జరిగింది. ఆ తర్వాత ఫొటోలు దిగాలనుకున్నపుడు జనం ఎక్కువగా ఉండటంతో అక్కడినుంచి వెళ్లిపోయాం. రద్దీ తగ్గిన తర్వాత మళ్లీ అక్కడికి వచ్చాం. అయితే, ఫొటోలు దిగాలన్న తొందరలో చెప్పులు కూడా విడిచిపెట్టడం మర్చిపోయాం. మాకు తిరుమల దేవుడిపై ఎంతో నమ్మకం ఉంది.
మా పెళ్లి రోజు మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు ఎప్పటికీ ఇలాగే మాపై ప్రేమను చూపిస్తారని భావిస్తున్నాము’’ అని పేర్కొన్నాడు. కాగా, సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ల పెళ్లి గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మరి, విగ్నేష్ శివన్ క్షమాపణ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nayanthara: శ్రీవారి సన్నిధిలో అపచారం.. చెప్పులు వేసుకుని మాఢ వీధుల్లో తిరిగిన నయనతార!