ప్రస్తుతం సౌత్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసేందుకు ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ, విలన్ పాత్ర పోషించేందుకు లేడీ విలన్స్ బాగా కరువయ్యారు. ఆ లోటుని భర్తీ చేసేందుకు చాలా గ్యాప్ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ దొరికింది. ఈ డేర్ అండ్ డ్యాషింగ్ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైపోయింది. ముఖ్యంగా క్రాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది.
వరలక్ష్మీ శరత్ కుమార్ గతంలో కంటే ఇప్పుడు చాలా సన్నగా మారిపోయింది. సన్నగా నాజూకుగా తయారైంది. అయతే ఇకనుంచైనా గ్లామర్ పాత్రలు పోషిస్తుందేమో అని ఎదురుచూసే వారికి నిరాశే ఎదురవుతుందని చెప్పాలి. ఎందుకంటే వరలక్ష్మీ శరత్ కుమార్ గ్లామర్ రోల్స్ చేయనని చెబుతోంది. అవును తాను విలన్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు గ్లామర్ పాత్రలు చేసే ఉద్దేశం లేదని కుండ బద్దలు కొట్టేసింది. ఈ వార్త విన్న తర్వాత ఆమె అభిమానులు ఒకింత బాధ పడ్డారనే చెప్పాలి.
ఆమె తొలి సినిమాలో శింబుతో కలిసి గ్లామర్ పాత్రలో కనిపించిన వరలక్ష్మీ శరత్ కుమార్ తర్వాత మాత్రం విలన్ పాత్రల్లో కనిపించడం ప్రారంభించింది. ఎందుకు విలన్ పాత్రలు చేస్తున్నారని ప్రశ్నించగా.. “నాకు గ్లామర్ పాత్రలు సెట్ కావనే భావన కలిగింది. అందుకే నేను లేడీ విలన్ పాత్రలు చేస్తున్నాను. పైగా గ్లామర్ పాత్రలు పోషించడానికి చాలా మంది ఉన్నారు. కానీ, ఇలాంటికొన్ని పాత్రలు నేను మాత్రమే చేయగలను అనిపిస్తూ ఉంటుంది. నాకు గురువు దర్శకుడు బాలా గారు” అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. చేతిలో అరడజను సినిమాలతో వరలక్ష్మీ చాలా బిజీగా ఉంది. తెలుగులో వీర సింహారెడ్డి, హనుమాన్ సినిమాలు చేసింది. తమిళ్ లో పంబన్, పిరాంతల్ పరాశక్తి వంటి సినిమాలు చేస్తోంది. శబరి అనే సినిమా అటు తమిళ్, ఇటు తెలుగులో విడుదల చేయనున్నారు. మలయాళంలో కలర్స్, కన్నడలో లగాం అనే సినిమాలు చేస్తోంది. హీరోయిన్ల కంటే లేడీ విలన్ గా వరలక్ష్మీనే చాలా బిజీగా ఉంటోంది. నటనలో తండ్రికి తగ్గ కుమార్తె అంటే ఇప్పటకే విమర్శకుల ప్రశంసలు అందుకుంది.