Vaishnav Tej: మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తం.. హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా జరిగింది. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయిధర్మ తేజ్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత ఎస్. నాగవంశీ స్క్రిప్ట్ ను దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు.
ఈ సందర్భంగా సినిమాకు సంభందించి ఓ డైలాగ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. “రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా..” అని చిత్రంలో విలన్ పాత్ర హెచ్చరించగా.. “ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా!” అని వైష్ణవ్ తేజ్ నోటి నుండి ఊరమాస్ డైలాగ్ చెప్పడం మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ అనే చెప్పాలి.
2023 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డెబ్యూ మూవీతోనే ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్.. ఈ సినిమాలో సరికొత్త మాస్ అవతారం ఎత్తినట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన ‘శ్రీలీల‘ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ ని మాస్ అవతారంలో చూపించబోతున్నట్లు తెలిపారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.