తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ఢీ ఒకటి. ఇప్పటివరకు పదమూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోలో.. ప్రస్తుతం ‘ఢీ డాన్స్ ఐకాన్’ పేరుతో పద్నాలుగో సీజన్ నడుస్తోంది. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఈ ‘డాన్స్ ఐకాన్’ సీజన్ చివరిదశకు చేరుకుంది. అయితే.. ఎప్పటిలాగే తర్వాత ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ప్రోమో చూస్తుంటే.. డాన్స్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నట్లుగా ఉంది. సీజన్ విన్నర్ ఎవరో డిసైడ్ చేసే ఈ ఫినాలే ఎపిసోడ్ కి ప్రతీసారి టాలీవుడ్ కి సంబంధించి ఎవరో ఒక స్టార్ హీరో గెస్ట్ గా వస్తుంటారు.
ఈ క్రమంలో ఈసారి కూడా విజేతను ప్రకటించేందుకు టాలీవుడ్ టాప్ హీరో హాజరయ్యాడు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ‘మాస్ రాజా’ రవితేజ.. డాన్స్ ఐకాన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. షోలో ఎంటర్ అయినప్పటి నుండే ఫుల్ ఎనర్జీతో అందరినీ పలకరించి, స్టేజ్ పై డాన్స్ చేసిన రవితేజ.. హైపర్ ఆదిని ఓ ఆటాడుకున్నాడు. ఆదిని చూడగానే.. ‘నీకు ఈ డాన్స్ షోకి సంబంధమేంటి? అని పంచ్ వేసి.. అందరిని ఆడుకుంటావ్ కదా.. నువ్వు అయిపోయావ్ ఇవాళ!’ అంటూ నాన్ స్టాప్ పంచులతో ఆదిని ఓ పట్టుబట్టాడు. ప్రస్తుతం ఆదిపై మాస్ రాజా పంచులు వేసిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.