సాధారణంగా టీవీ షోలలో సెలబ్రిటీల లవ్ ట్రాక్ అనేది దాదాపు టీఆర్పీ కోసమే కంటిన్యూ చేస్తుంటారు. ఇదివరకు తెలుగు బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అంటే సుధీర్, రష్మీల జోడి కనిపించేది. కానీ.. వారిద్దరూ కలిసి షోలు చేయడం మానేశాక సీరియల్ జంట రవికృష్ణ, నవ్యస్వామిల జోడి పాపులర్ అయ్యింది. వీరిద్దరూ నిజంగా ప్రేమలో లేకపోయినా, ఇన్నాళ్లు ఆన్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు లవర్స్ అన్నట్లు నటిస్తూ వచ్చారు. దీంతో ఇద్దరూ లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే రూమర్స్ కూడా మొదలైపోయాయి. అయితే.. వీరిపై పెళ్లి రూమర్స్ వచ్చినా సైలెంట్ గా ఉండటంతో నిజంగానే పెళ్లి అంటూ కథనాలు వైరల్ అయిపోయాయి.
బుల్లితెర ప్రేమికులుగా పేరు తెచ్చుకున్న రవికృష్ణ, నవ్యస్వామి జంట.. పలు సీరియల్స్ లో జంటగా నటించారు. అయితే.. ఆమె కథ అనే సీరియల్ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. అదీగాక టీవీ షోస్, ఈవెంట్స్ లో ఇద్దరూ కలిసి స్టేజిపై రొమాన్స్ చేయడం, రొమాంటిక్ సాంగ్స్ కి పెర్ఫార్మన్స్ లు చేయడంతో వీరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ రూమర్స్ ఇంకా పీక్స్ కి చేరుకున్నాయి. ఇక రవితో లవ్ పై రూమర్స్ రోజురోజుకూ పెరుగుతుండటంతో నవ్య ఓసారి పుకార్లను కొట్టి పారేసింది. ఈ క్రమంలో ప్రముఖ ఛానల్ లో యాంకర్ రవి హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అనే ప్రోగ్రాంలో రవి, నవ్య పాల్గొన్నారు.
ఇక ఇదే షోలో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ.. రవికృష్ణపై తన ప్రేమను బయట పెట్టేసింది నవ్య. ఏకంగా ఐ లవ్ యూ అని చెప్పేయడం విశేషం. ఈ ప్రోగ్రాంలో రవికృష్ణ, నవ్యస్వామి ఇద్దరూ కలిసి స్టేజిపై రొమాంటిక్ పెర్ఫార్మన్స్ చేశారు. ఆ తర్వాత నవ్య చేతిలో గులాబీ పువ్వు పట్టుకొని రవికి ప్రపోజ్ చేసేసింది. “నేను ప్రేమించే వ్యక్తి రవి.. నువ్వు వచ్చాక వ్యక్తిగతంగా నేను చాలా మారాను. నా ప్రపంచం నువ్వే. ఐ లవ్ యూ” అని అందరి ముందు చెప్పేసింది. దీంతో రవితో పాటు చూస్తున్నవారు కూడా ఆశ్చర్యపోయి.. ఆనందం వ్యక్తం చేశారు. ఆ వెంటనే రవి నవ్య ఇచ్చిన పువ్వు తీసుకొని ఆమెను హగ్ చేసుకున్నాడు. ఈ విధంగా సీరియల్ కపుల్ కాస్త రియల్ లవర్స్ అయ్యారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.