తెలుగు బుల్లితెరపై ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమయ్యే ఈ షోలో.. బుల్లితెర ఆర్టిస్టులు, సెలబ్రిటీలు తమ రియల్ జంటలతో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పెళ్లికాని బ్యాచిలర్స్ కూడా వేరొకరిని జంటగా షోలో పాల్గొంటున్నారు. అలా చాలామంది సీరియల్ సెలబ్రిటీల జంటలతో పాటు జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్.. జోర్దార్ సుజాత జంటగా పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ క్రమంలో వచ్చే మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించి ‘మిస్టర్ అండ్ మిసెస్’ సరికొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో అంతా అందరు సెలబ్రిటీ కపుల్స్ తో ఫన్ గా సాగినప్పటికీ.. చివరలో రాకింగ్ రాకేష్ – జోర్దార్ సుజాత ఇద్దరూ వాట్సాప్ చాట్స్ విషయంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. వేరే వాళ్ళతో రాకేష్ చాట్ చేసిన మెసేజులు ఎప్పుడైనా చదివావా? అని సుజాతని అడగ్గా.. “ఆ విషయంలో చాలాసార్లు మా ఇద్దరి మధ్య గొడవలు.. డిస్కషన్స్ జరిగాయి. సుజాత నా చాట్స్ చదువుతుంది” అని చెప్పాడు రాకేష్. అలా ఒకరి గురించి ఒకరు చెబుతూ.. ఇద్దరూ హర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. రాకేష్ – సుజాత మధ్య ఏం జరిగింది? అనేది వచ్చేవారం పూర్తి ఎపిసోడ్ లో చూడాలి. మరి రాకేష్ – సుజాత జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.