ఒకప్పుడు హీరోయిన్గా మెరిసిన కస్తూరి శంకర్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు, సీరియల్స్లో నటించి మెప్పించారు. సీరియల్స్లోనే కాకుండా తమిళంలో బిగ్బాస్, తెలుగులో క్యాష్ వంటి షోస్లో పార్టిసిపేట్ చేశారు. పరంపర అనే వెబ్ సిరీస్లో కూడా ఆమె నటించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోషూట్కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఇప్పటికీ తాను హీరోయిన్నే అంటూ.. అప్పుడప్పుడూ ఆమె బోల్డ్ ఫోటోలని కూడా షేర్ చేస్తుంటారు. ఇక కస్తూరిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో తులసిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, సీరియల్స్తో ఫుల్ బిజీగా ఉన్న కస్తూరి తాజాగా అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు.
బీచ్లో అలలతో ఆడుకుంటుండగా ఆమె సడన్గా మిస్ అయ్యారు. దీంతో ఆమె ఆ అలలతో కొట్టుకుపోయిందా? అనే సందేహం వ్యక్తమవుతోంది ఆమె అభిమానులకు. ఇదంతా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో భాగమే అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అసలే మనవాళ్ళు సీరియల్స్కి బాగా కనెక్ట్ అవుతారు. అందులోనూ ఏళ్ళ తరబడి సాగుతున్న సీరియల్స్లో పాత్రలంటే కుటుంబసభ్యుల కింద ఓన్ చేసేసుకుంటారు. అలాంటిది ఆ పాత్రకి మధ్యలో ఎలాంటి ఆపద వచ్చినా తమకి వచ్చినట్టే ఫీలవుతా ఉంటారు.
తాజాగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి కేరెక్టర్ ప్రమాదంలో పడడంపై ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. ఏమవుతుందో ఏమిటో అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ‘అలలతో ఆడుకున్న తులసి.. ఆ అలలతోనే కొట్టుకుపోయిందా?’ అంటూ ఒక ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి తులసి అలలతో పాటు కొట్టుకుపోతుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.