పండగొచ్చిందంటే ఎక్కడ లేని సందడంతా బుల్లితెర షోస్ లోనే ఉంటుంది. మన మధ్యతరగతి గది నుంచి వచ్చిన సెలబ్రిటీలు, వాళ్ళ తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కనువిందు చేస్తుంటే కన్నుల పండుగలా ఉంటుంది కదా. ఇలాంటి పండగలని చేయడంలో మల్లెమాలది ఒక ప్రత్యేకమైన శైలి. ప్రతీ పండగకి, ప్రతీ అకేషన్ కి బంధాలను, బాంధవ్యాలను గుర్తు చేసే విధంగా స్టేజ్ మీదకి ఆర్టిస్టుల కుటుంబ సభ్యులని పిలవడం.. వారితో ఆర్టిస్టుల మీద పంచులు వేయించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రోమోని ఇంట్రస్టింగ్ గా కట్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. అప్పటి వరకూ నవ్వించి.. ప్రోమో క్లైమాక్స్ లో కన్నీళ్లు తెప్పించేసే ఎమోషన్ ని ఎలివేట్ చేస్తారు.
తాజాగా దసరా సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ‘మంగమ్మ గారి కొడుకు’ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో డ్యాన్సర్ పండు తన ప్రేయసిని తలచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. “ఊహ తెలియని టైంలో అమ్మ చనిపోయింది, ఆ తర్వాత అంతగా ఈ అమ్మాయిని ప్రేమించాను. అమ్మలా ఉంటానని చెప్పి ఆ అమ్మాయి నాకు ప్రామిస్ చేసింది. తల్లి, తల్లి అని పిలుచుకునేటోడ్ని. నా తల్లి దగ్గరకే వెళ్ళిపోయింది, నన్నొదిలేసి. తన కంటే బాగా ఆ అమ్మాయి చూసుకుంటుందని కోపంతో మా అమ్మే తీసుకెళ్ళిపోయిందేమో” అంటూ పండు ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ అక్టోబర్ 2న ఆదివారం నాడు ప్రసారం కానుంది.