లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెద్ద సమస్యే వచ్చిపడింది! పెళ్లి తర్వాత కూడా చకాచకా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నయన్.. ‘కనెక్ట్’ సినిమాని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నిర్మించిన ఈ మూవీ.. ఆత్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు మూవీ టీమ్ గతంలో అనౌన్స్ చేసింది. ఇప్పుడదే సినిమా వల్ల నయన్ ప్రాబ్లంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది! ఇక గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పినట్లే ఇప్పుడు జరుగుతున్నట్లు కనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాదిలో స్టార్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నయన్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. అలా చేసిన ‘కనెక్ట్’.. హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అంచనాలని పెంచేస్తోంది. కావాల్సినంత హైప్ కూడా క్రియేట్ అవుతోంది. అయితే ‘కనెక్ట్’ ప్రదర్శనకు స్క్రీన్స్ కేటాయించిన థియేటర్స్ ఓనర్స్ ఇప్పుడు చిత్రబృందానికి షాకిచ్చారు. 99 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా ప్రదర్శిస్తామని ప్రొడ్యూసర్ విఘ్నేష్ శివన్ గతంలో చెప్పారు. అయితే బ్రేక్ లేకపోతే.. మూవీని స్క్రీన్ చేయలేమని థియేటర్ ఓనర్స్ డైరెక్ట్ గా చెప్పేశారట.
పుడ్ కోర్ట్స్ వల్ల వచ్చే ఆదాయం కోల్పోతారని, అందుకే ఇంటర్వెల్ విషయాన్ని అంత గట్టిగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్రేక్ గురించి నిర్మాణ సంస్థ, తమకు ముందు చెప్పలేదని.. ప్రమోషన్స్ ద్వారానే ఈ విషయం తెలుసుకున్నామని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతమైతే చర్చలు సాగుతున్నాయని.. త్వరలో ఏ విషయమనేది తేలిపోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణుస్వామి.. పెళ్లి తర్వాత నయన్ సమస్యల్లో ఇరుక్కుంటుందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. మరి ‘కనెక్ట్’ రిలీజ్ లోపు నయన్ కు ఎదురైన సమస్య పరిష్కారమైపోతుందా లేదా అనేది తెలియాలి అంటే డిసెంబరు 22 వరకు ఆగాల్సిందే. మరి ఈ ఇష్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.