దేవుడు ఉన్నది నిజమైతే.. దెయ్యం ఉన్నది కూడా అని కొందరు వాదిస్తారు. దిష్టి, చేతబడి, క్షుద్ర పూజలు ఈ మాటలు వింటే మోడ్రన్ యుగంలో ఏంటి ఈ పిచ్చి వాదనలు అంటారు. ఇదే మోడ్రన్ యుగంలో మూఢ నమ్మకాలతో ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడం కూడా చూస్తేనే ఉన్నాం. ఈ డిజిటల్ కాలంలో కూడా చేతబడులు ఉన్నాయి. ఇది మేమంటన్న మాటలు కాదండి. రామ్గోపాల్ వర్మ గాయం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా ఎన్నో సినిమాల్లో నటించిన ‘టార్జాన్’. అదే, మన ఎదిరె లక్ష్మీనారాయణ గుప్తా చేసినవి.
సినీ రంగంలో రాణించాలంట్ మాత్రమే కాదు.. లక్ కూడా ఉండాలంటున్నాడు మన టార్జాన్. ‘దేవుడి దయ వల్ల నన్ను ప్రేక్షకులు ఆదరించారు. అలా 30 ఏళ్లపాటు సినిమాల్లో నటుడిగా కొనసాగాను. సినీ కేరీర్ పరంగా నేను చాలా సంతోషంగా ఉన్నా. మా నాన్న ఊరి సర్పంచ్గా ఉండేవారు. మేమంటే గిట్టని వారు, మా దగ్గరి బంధువులే మా కుటుంబానికి చేతబడి చేశారు. రెండేళ్లు అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం’ అంటూ మన టార్జాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘మా కుటుంబం మొత్తానికి చేతబడి చేశారు. చేతబడి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మా అన్నయ్య ఏం తిన్నా వాంతులు చేసుకునేవాడు. నేను నీళ్లు తాగినా కూడా వెంటనే బయటకు వచ్చేవి. కడుపు నొప్పి చాలా తీవ్రంగా ఉండేది. అలా మేము 13 ఏళ్లు నరకం చూశాం. నష్టాల్లో కూరుకుపోయి ఉన్నవన్నీ అమ్ముకుని హైదరాబాద్ వచ్చేశాం. ఇక్కడికి వచ్చాక డబ్బులు లేక తినడానికి తిండి దొరక్క కష్టాలు పడ్డాం. దీంతో ఏ పని దొరికితే అది చేసేవాళ్లం. ఈ క్రమంలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ప్రారంభించాం. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది’ అని పేర్కొన్నాడు. అయితే ఇప్పటికీ తన సొంత గ్రామానికి వెళ్లినప్పుడు అనారోగ్యం బారిన పడతానని. అక్కడ నీళ్లు తాగితే వెంటనే బయటకు వస్తాయని, కడుపు నొప్పి వస్తుందని చెప్పాడు. ఇప్పటికీ చేతబడులు ఉన్నాయని, మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు అన్నాడు. అమావాస్య, పౌర్ణమిలను నమ్మినప్పుడు చేతబడి ఉందని కూడా నమ్మాలంటూ లక్ష్మీనారాయణ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆర్టికల్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.