తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు మొదట విలన్ పాత్రలో నటించి తర్వాత హీరోలుగా మారారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. విలన్ గా మెప్పించాడు. ‘వన్ బై టు’ మూవీతో హీరోగా మారారు. తర్వాత వచ్చిన తాజ్ మహల్ చిత్రం మంచి విజయం అందుకోవడంతో శ్రీకాంత్ కి వరుస అవకాశాలు వచ్చాయి. తన సహనటి ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు.
ఇక టాలీవుడ్ లోని అందమైన జంటల్లో శ్రీకాంత్, ఊహల జంట ఒకటి. పెళ్లయి ఇన్నేళ్లయినా వీరి మధ్య అనుబంధం, అన్యోన్యత అలాగే వున్నాయి. ఈ జంట ఎంతో మందికి స్ఫూర్తి గా ఉన్నారు. తాజాగా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమ పెట్టి పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు.
ఇక రోషన్ మొక్కులు చెల్లించుకుంటున్న సందర్భంగా ఆయన వెంటన ఊహ, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అయితే ఎరుపు లంగా వోణిలో శ్రీకాంత్ దంపతుల కూతురు మేధ ఎంతో సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ.. ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.