నటీనటులు.. రిపోర్టర్స్ పై సీరియస్ కావడం ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం. ఆ మధ్య ‘డీజే టిల్లు’ ఈవెంట్ లో ఒకాయన హీరోయిన్ పుట్టమచ్చలు గురించి అడగడం, హీరో సిద్ధు ఇదేంటని అడగడం అప్పట్లో హాట్ టాపిక్. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో హీరోయిన్ రెజీనాని కూడా.. ‘మీకు ఓసీడీ ఉందా’ అని ఓ జర్నలిస్టు అడిగేశాడు. దీంతో.. ఈ క్వశ్చన్ ఏంటని ఆమె కూడా అడిగేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్ తాప్సీ కూడా.. రిపోర్టర్ తో అందరి ముందు గొడవపడింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ మొదట తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, ఆ తర్వాత ప్రభాస్, రవితేజ లాంటి పలువురు హీరోలతో సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చి, అక్కడే సెటిలైపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ పేరు సంపాదించింది. మరోవైపు బాలీవుడ్ లో ఈ మధ్య బాయ్ కాట్ ట్రెండ్ ఎక్కువైపోయింది. ఆ ఊపులోనే తాప్సీ నటించిన ‘దొబారా’ రిలీజైంది. ఘోరమైన డిజాస్టర్ గా నిలిచి, కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ‘ఓటీటీ ప్లే అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ ఓ జర్నలిస్టుతో గొడవపడి వార్తల్లో నిలిచింది.
ఈ వేడుకలో తాప్సీతో ఓ రిపోర్టర్.. దొబారా సినిమా నెగిటివ్ టాక్ గురించి అడిగాడు. దీంతో ఫుల్ ఫైరయిన తాప్సీ.. ‘నెగిటివ్ టాక్ బారిన పడని చిత్రమేదైనా ఉందా?’ అని ఎదురుప్రశ్న వేసింది. రిపోర్టర్ మరో ప్రశ్న అడగాలనుకోగా.. ‘ ముందు నా క్వశ్చన్ కి సమాధానం చెబితే, మీకు నేను ఆన్సర్ చెబుతాను’ అని తాప్సీ సదుర వ్యక్తితో వాదించింది. ‘ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్ చేసుకుని రాలేరా’ అని తాప్సీ రుసరుసలాడింది. దీనిపై నెటిజన్స్ కొందరు తాప్సీని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఓటీటీ ప్లే అవార్డుల్లో భాగంగా ‘హసీనా దిల్ రుబా’ చిత్రానికి గానూ ఉత్తమ హీరోయిన్ గా అవార్డు సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: తాప్సీ ప్రైవేట్ పార్ట్స్ పై కొనసాగుతున్న రచ్చ! KRK సెటైర్స్ వైరల్!