Sunny Leone: నీలి చిత్రాల నటిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు సన్నీ లియోన్. గత కొన్ని సంవత్సరాలుగా పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో కొనసాగుతున్నారు. తన సొంత దేశం అయిన ఇండియాలో స్థిరపడిపోయారు. 2012లో వచ్చిన జిస్మ్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో కరెంట్ తీగ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పీఎస్వీ గరుడ వేగ సినిమాలో నటించారు. ఆమె తాజా తెలుగు చిత్రం ‘‘జిన్నా’’ విడుదలకు సిద్ధంగా ఉంది. సన్నీ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు స్కామర్లు ఆమె పేరును వాడుకుని స్కాములకు తెరతీస్తున్నారు.
తాజాగా, థాయ్లాండ్లో అవార్డు ఫంక్షన్ పేరిట ఓ స్కాం వెలుగులోకి వచ్చింది. ఆ అవార్డు ఫంక్షన్తో సన్నీ లియోన్ అసోషియేట్ అయిందని, జనం వెంటనే రిజిస్ట్రర్ చేసుకోవాలని అందులో ఉంది. ఇది సన్నీ దృష్టికి వెళ్లింది. ఇక, సన్నీనే ఆ స్కామును తెరపైకి తెచ్చారు. తన పేరును వాడుకుని జనాల్ని మోసం చేయటానికి చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం ఆమె తన ట్విటర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘‘ గమనిక : నాకు ఆ ఈవెంట్కు, అవార్డు షోకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఈవెంట్ నిర్వహించే వారికి నా పేరును వాడుకునే హక్కు లేదు.
దయచేసి అలాంటి స్కాంల వలలో చిక్కుకుని మోసపోకండి’’ అని హెచ్చరించారు. కాగా, సన్నీ లియోన్ ప్రస్తుతం రంగీల, వీరమాదేవి, షేరో, ఓ మై గోస్ట్, కోకాకోలా, హెలెన్, ది బాటిల్ ఆఫ్ భీమా కొరెగాన్, ఛాంపియన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు శరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక, సన్ని లియోన్ కేవలం ఇండియన్ సినిమాల్లోనే కాదు. వేరే దేశాల్లోనూ సినిమాలు చేశారు. నాలుగు ఇంగ్లీష్ సినిమాలతో పాటు.. పాస్వర్డ్ అనే నేపాలీ సినిమా.. బికోవ్ అనే బంగ్లా సినిమా చేశారు. ప్యాన్ వరల్డ్ స్టార్ అయ్యారు.
NOTICE:
I am NOT associated with this #event in anyway nor does this award show / event organisers have any rights to use my name.
Kindly make sure that you do not fall for such #scams. pic.twitter.com/5eBVFoaeg9— Sunny Leone (@SunnyLeone) September 26, 2022