బుల్లితెర పై స్టార్ స్టేటస్ అందుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ మొదలైనప్పటి నుండి సుధీర్ టీవీ ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ అయిపోయాడు. అయితే.. జబర్దస్త్ పై జనాల అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే షోలో, స్కిట్ లలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తుంటారు కమెడియన్స్. కానీ ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినబడినా ప్రేక్షకులు జబర్దస్త్ చూస్తారనేది మాత్రం వాస్తవం.
ఇక జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న సుడిగాలి సుధీర్ ని మొదటి నుండి అమ్మాయిల వెంటపడే మన్మథుడిలా చూపిస్తూ వచ్చారు. స్కిట్ ఉన్నా లేకపోయినా సుధీర్ పై సభ్యులు, జడ్జిలు అమ్మాయిల గురించి పంచులు వేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ప్రోమోలోని ఓ సీన్ సుధీర్ ని మళ్లీ వార్తల్లో నిలిపింది.సుధీర్ స్కిట్ లో సంభాషణలు హైలైట్ అయ్యాయి. గెటప్ శ్రీను.. ‘నేను ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఏం చేశావ్’ అనగానే.. సుధీర్ రియాక్ట్ అవుతూ.. ‘ఆఫీస్ నుంచి వస్తుంటే ఓ అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఇద్దరం వెళ్తుండగా చాలా వర్షం పడింది. తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేస్తే బాగోదని చెప్పి దగ్గరలో ఉన్న ఓ హోటల్లో.. ఓ రూమ్ తీసుకుని ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం’ అన్నాడు సుధీర్. ఇది విని గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, రష్మీతో సహా అందరూ తెగ నవ్వేశారు.
సుధీర్ స్కిట్ లో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపించేసరికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బందిగా ఫీలయ్యారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండైరెక్ట్ గా స్కిట్ లో అర్ధాలు శృతిమించుతున్నాయని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లేటెస్ట్ ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.