తెలుగు బుల్లి తెరపై స్టార్ యాంకర్గా వెలుగొందుతున్నారు సుడిగాలి సుధీర్. ఓ చిన్న మెజీషియన్ స్థాయినుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. స్టార్ కమెడియన్గా మారిపోయారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన ప్రతిభ చాటుకున్నారు. కమెడియన్ స్థాయినుంచి ప్రస్తుతం హీరోగా మారారు. ఓ వైపు టీవీలో షోలో చేస్తూనే.. మరో వైపు సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. అడపాదడపా హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘‘గాలోడు’’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా, గాలోడు హీరో,హీరోయిన్ సుధీర్, గెహ్నా సిప్పిలు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ ఎంతో సరదగా గడిచింది. బిత్తిరి సత్తి, సుధీర్పై పంచుల వర్షం కురిపించారు. తన కామెడీ టైమింగ్తో అదరగొట్టారు. వీరిద్దరి మధ్యా జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. ఇంటర్వ్యూ జరిగే చోటుకు వచ్చిన ముగ్గురు నిలబడి ఉంటారు. కొద్దిసేపటి తర్వాత సుధీర్ ‘‘ అన్న మనం కూర్చుని మాట్లాడుకుందాం’’ అని అంటాడు.
అందుకు సత్తి ‘‘కుర్చీలేవు ఏం లేవు ’’ అంటూ ఎవరికో ఫోన్ చేస్తాడు. ఆ వెంటనే ‘‘ అరే రాజు! ఓ మూడు కుర్చీలు తీసుకురా.. చెక్కవి. మా దోస్తురా.. సినిమా చేస్తున్నాడు. తీసుకురండి. మెట్లు ఎక్కుతున్నావ్’’ అని సుధీర్ వైపు తిరుగుతాడు ‘‘ మంచం చెప్పినావ్’’ అని సుధీర్ను ప్రశ్నిస్తాడు. ఇందుకు సుధీర్ ‘‘ మంచం నేనెందుకు చెప్తానన్నా.. ఇంటర్వ్యూ ఉంటే కుర్చీలు చెబుతా గానీ’’ అంటాడు. అందుకు సత్తి ‘‘నీ ప్రోగ్రాం అంటే మంచాలు అంటున్నారు’’ అని అన్నాడు. ఇందుకు సుధీర్ నవ్వుతూ ‘‘కాదన్నా’’ అని సమాధానం ఇచ్చాడు.