బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఓ గొడవ. మొన్నమొన్నటి వరకు బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది. ఈ ఏడాది ఒక్కటంటే కనీస ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దానికి బాయ్ కాట్ ట్రెండ్ ఓ కారణమైతే, కంటెంట్ లేకపోవడం కూడా మరో మైనస్ అయింది. ఇక నెపోటిజం గురించి ఎప్పుడూ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పక్కనబెడితే.. కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ విషయం.. మళ్లీ ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దాదాపు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం, పౌరసత్వ సవరణ చట్టం,ఎన్ఆర్సీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి వ్యతిరేతంగా 2020 జనవరి మొదటి వారంలో దిల్లీలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు నిరసనకు దిగారు. అప్పట్లో ఇది హింసాత్మకంగా కూడా మారింది. కొందరు దుండగులు ముసుగు వేసుకుని దాడి చేయడంతో దాదాపు 50 మందికి గాయపడ్డారు. వీళ్లకు సంఘీభావం తెలియజేయడానికి హీరోయిన్ దీపికా పదుకొణె.. క్యాంపస్ కి వచ్చింది. ఇది అప్పట్లోనే రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్ అయింది.
అయితే హీరోయిన్ దీపిక.. జేఎన్టీయూకి వెళ్లడానికి దాదాపు రూ.5 కోట్ల వరకు తీసుకుందని ప్రచారం జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కానీ దీనిపై దీపికా పెద్దగా స్పందించలేదు. ఈ మధ్య మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ స్వరభాస్కర్ ని దీని గురించి ప్రశ్నించగా, ఆమె మండిపడింది. ‘ఇది పూర్తిగా అర్ధంపర్ధం లేని వ్యవహారం. రెండు నిమిషాలు జేఎన్ యూలో ఉన్నందుకే రూ.5 కోట్లిచ్చారా?.. సినిమా వాళ్ల గురించి మరీ ఇంత చెత్తగా మాట్లాడుకుంటారా? సినిమా వాళ్లు ఎలా కనిపిస్తున్నారు’ అని స్వర భాస్కర్ ఫైర్ అయింది. మరి స్టార్ హీరోయిన్ స్వర భాస్కర్ కోపం తెచ్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: పోలీస్ విచారణకి హాజరైన స్టార్ హీరోయిన్! కారణం?