కన్నడ హీరో సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాలో రాక రక్కమ్మ సాంగ్ తో అలరించిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పోలీస్ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్ధిక విభాగం జాక్వెలిన్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో జాక్వెలిన్ ఇవాళ (సెప్టెంబర్ 14) ఉదయం 11.30 గంటల సమయంలో ఢిల్లీలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు రాత్రి 8 గంటల వరకూ జాక్వెలిన్ ను విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపు, ఎల్లుండి కూడా విచారణ కొనసాగనుంది.
200 కోట్ల దోపిడీ కేసులో హీరోయిన్ ని ప్రశ్నించిన పోలీసులు
ఇక ఈ విచారణకు జాక్వెలిన్ తో పాటు.. ఆమెను సుకేష్ కు పరిచయం చేసిన పింకీ ఇరానీ అనే మహిళ కూడా హాజరయ్యారు. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధం ఉన్న బాలీవుడ్ నటి నోరా ఫతేహీని ఇటీవలే ఢిల్లీ పోలీసులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కి చెందిన పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో నోరా ఫతేహీతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు. సుకేష్ నుంచి రూ. 5.71 కోట్ల విలువైన బహుమతులు అందుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్ ను ఢిల్లీ పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఈ హీరోయిన్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Jacqueline Fernandez arrives at EOW office in Delhi in connection with the conman Sukesh Chandrashekhar money Laundering case https://t.co/XFDrF8xDaB pic.twitter.com/qzkIfe9Tzh
— ANI (@ANI) September 14, 2022