ఒకరేమో క్రికెట్ లో తోపు. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ ఇప్పుడు కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
టీ20 క్రికెట్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ నేమ్ క్రిస్ గేల్. పేరుకే విండీస్ క్రికెటర్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్ లో ఆడి చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక మన దేశంలోనూ ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీలో కోల్ కతా, బెంగళూరు, పంజాబ్ జట్లకు ఆడిన గేల్.. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి గేల్ ని టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కలిశాడు. అతడితో తీసుకున్న ఫొటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారింది. అసలు వీళ్లిద్దరూ ఎందుకు కలిశారో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో మధ్య టోర్నీ జరుగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా 8 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి. వీటి మధ్య ఆరు నగరాల్లో 19 మ్యాచులు జరగనున్నాయి. రీసెంట్ గానే మలయాళ స్టార్స్, తెలుగు వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కెప్టెన్ అఖిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ దెబ్బకు మన టీమ్ విజయం కూడా సాధించింది. ఇకపోతే మన జట్టులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండు విభాగాల్లోనూ తన వంతు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అలాంటి తమన్.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తో పాటు కన్నడ చలనచిత్ర కప్ అనే మరో టోర్నీలోనూ ఆడుతున్నాడు. కర్ణాటకలో జరిగే ఈ టోర్నీలో ఆరు టీమ్స్ పాల్గొంటున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు పలువురు యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా పాల్గొంటారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని స్టేడియంలో గేల్, తమన్ కలిశారు. ఈ క్రమంలోనే తీసుకున్న ఫొటోని తమన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త నెటిజన్స్ మధ్య డిస్కషన్స్ కు కారణమైంది. మరి క్రికెట్ లో సిక్సులతో హోరెత్తించే గేల్.. తన పాటలతో కేక పుట్టించే తమన్ ఒక్కచోట కలవడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
With @henrygayle for #KCC ❤️
Playing for @NimmaShivanna for Our dearest @PuneethRajkumar ANNA 🫶🏆💥💥💥💥 pic.twitter.com/wZdiGfavHH— thaman S (@MusicThaman) February 24, 2023