ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి రేటింగ్తో దూసుకుపోతుంది. కొన్ని రోజుల క్రితం వరకు దీనికి జడ్జీగా ఇంద్రజ, యాంకర్గా సుడిగాలి సుధీర్ ఉండేవారు. అయితే కారణాలు తెలియదు కానీ.. ప్రస్తుతం సుధీర్ స్థానంలో రష్మి యాంకర్గా కొనసాగుతోంది. ఇక తాజాగా వచ్చే ఆదివారానికి(జూన్ 12) సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో షాకిచ్చే విషయాలను బయటపెట్టారు నిర్వహకులు. ఇక ప్రోమో ప్రారంభం అవుతూనే సుడిగాలి సుధీర్ని టార్గెట్ చేస్తూ రష్మి మీద పంచులు వేశాడు హైపర్ ఆది. ఇక దీనిలో ఆదికి సన్మానం చేస్తామని అనగా.. గతంలో వాడికి చేసి బయటకు పంపారు.. ఇప్పుడు నాకు ఎసరు పెట్టారని ఆది పంచ్ వేశాడు. ఇక ఇలా సాగుతుండగా.. సడెన్గా ప్రోమోలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. హైపర్ ఆదిని అరెస్ట్ చేసేందుకు ఏకంగా స్టేజ్ పైకే పోలీసులు రావడం సంచలనంగా మారింది.
షోలో భాగంగా హైపర్ ఆది ఓ అమ్మాయితో కలిసి డాన్సులు వేస్తున్నాడు. డ్యూయెట్లు పాడుతూ షోకి జోస్ తీసుకొస్తున్నాడు. ఇంతలో షో జరుగుతున్న సెట్లోకి పోలీసులు వచ్చారు. ఆది ఎక్కడంటూ షో సిబ్బందిని కాదంటూ లోపలికి వచ్చేశారు పోలీసులు. అంతేకాదు ఏకంగా స్టేజ్ ఎక్కేశారు. ఇది చూసిన ఆది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆదినే కాదు, షోలో ఉన్న అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జడ్జ్ గా ఉన్న పూర్ణ, యాంకర్ రష్మి, వర్ష, ఇమ్మాన్యుయెల్, రాంప్రసాద్ ఇలా అందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. కెమరాలు ఆపేయండి అంటూ సీరియస్ అయ్యారు. ఆదిని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు సైతం కూడా ఉండటం మరింత ఉత్కంఠకి గురి చేస్తుంది.
ఇది కూడా చదవండి: Hyper Aadi: ఆదీ చేసిన పనికి రష్మీ సీరియస్.. నువ్వు మనిషివా? పశువ్వా?
మరి హైపర్ ఆది నిజంగానే యాక్సిడెంట్ చేశాడా.. లేక టీఆర్పీ కోసం చేసిన స్టంటా తెలియాలంటే.. ఆదివారం వరకు ఆగాల్సిందే. ఇప్పటికే ఇది చూసిన నెటిజనులు మాత్రం స్టంట్ చెత్తగా ఉంది. మీరెన్ని వేషాలు వేసినా మేం నమ్మం అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ritu Chowdary:హైపర్ ఆదికి స్టేజ్ పైనే ప్రపోజ్ చేసిన రీతూ చౌదరి! ఇది సీరియస్ అంటూ ఎమోషనల్!