తెలుగు సినీ ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని గాయని సింగర్ సునీత. తనదైనశైలిలో పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఆవిడ మీడియా, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. ఎప్పుడన్నా సినిమా, టీవీ షోలలోనే ఎక్కువ కనిపిస్తుంటారు. కానీ, ఇప్పుడు సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఆవిడ కుమారుడి విషయంలో. అదేంటంటే త్వరలో సునీత కుమారుడు ఆకాశ్ త్వరలో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సింగర్ సునీత, భర్త రామ్ వీరపనేని అందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుమార్తె ఓ షోలో సింగర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోగా ఆకాశ్ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలతో సునీత అభిమానులు ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.