సింగర్ చిన్మయి… డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గానే కాకుండా సోషల్ మీడియాలో సమకాలీన అంశాలపై స్పిందిస్తూ తన భావనను వ్యక్తపరుస్తుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వచ్చే ఎలాంటి అంశాలపై అయిన ఈ సింగర్ స్పందిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే చిన్మయి- రాహుల్ దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొందరు నెటిజన్స్.. ఆమె గర్భవతిగా బిడ్డకు జన్మనివ్వలేదని, సరోగసి ద్వారా బిడ్డని కనిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలపై చిన్మయి తాజాగా స్పందిస్తూ.. కొంతమంది నేను సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చానని అంటున్నారు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి పోస్ట్ లు చేయలేదు. దాంతో ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయి. నేను గర్భవతి అని కొందరికి మాత్రమే తెలుసు.
ఇది కూడా చదవండి: కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి!
నన్ను నేను కాపాడుకుంటూ నా వ్యక్తిగత జీవితం, కుటుంబం, సన్నిహితులను బహిర్గతం చేయను. ఇంకా కొంత కాలం వరకు మా పిల్లల ఫోటోలను కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేయను. అంటూ చిన్మయి కూల్ గా సమాధానమిచ్చింది. ఇక దీంతో పాటు ఆమె మరో విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. నాకు సిజేరియన్ చేసే సమయంలో భజన పాటలను పాడాను. త్వరలోనే దాని గురించి ఓ అప్ డేట్ ఇస్తానంటూ తెలిపింది.