సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్గా ఉండే స్టార్ హీరోయిన్స్లో శృతిహాసన్ ఒకరు. ఆమె తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో రిలేషన్కు సంబంధించిన విషయాలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. తమ రిలేషన్ గురించి చెప్పాలనుకున్న విషయాలను ఎలాంటి సుత్తి లేకుండా చెప్పేస్తుంటారు.
తాజాగా, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఆమె బెడ్పై పడునుకుని ఉన్నారు. ఓ ఫొటోలో తన వీపు కనిపించేలా.. ఆ వీపుపై ఉన్న పేరు కనిపించేలా ఆమె ఫొటో దిగారు.
మె వీపుపై ఉన్నది ఆమె పేరే అన్న సంగతి తెలిసిందే. ఆ ఫొటోలతో పాటు ‘‘డేస్ ఇన్ బెడ్’’ అని రాసుకొచ్చారు.ప్రస్తుతం శృతి హాసన్ షేర్ చేసిన బెడ్ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే 2లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కాగా, శృతి హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా కెరీర్ను ప్రారంభించారు. 2009లో వచ్చిన లక్ అనే హిందీ సినిమాతో హీరోయిన్గా మారారు. అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, ఎన్బీకే 107లో బాలకృష్ణ సరసన నటిస్తున్నారు.