ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్ళు దాటినా కొందరు హీరోయిన్ వారి గ్లామర్ తో మతులు పోగొడుతుంటారు. వాళ్ళు సినిమాలు చేసినా, చేయకపోయినా ఫిజిక్ మాత్రం అలాగే మెయింటైన్ చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. ఆ కోవకే చెందుతుంది హీరోయిన్ శ్రియశరన్. ఆ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
ఇక కెరీర్ లో సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరి సరసన నటించిన శ్రియ.. హిట్స్ ప్లాప్స్ అన్ని చూసి స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. అలాగే స్టార్ హీరోయిన్ తన గ్లామర్ తో దాదాపు ఓ దశాబ్దంపాటు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది చెప్పవచ్చు. మెగాస్టార్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, బాలకృష్ణ ఇలా అందరితో సినిమాలు చేసిన శ్రియ.. కొంతకాలంగా సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. హీరోయిన్ గా కాకుండా సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తోంది. శ్రియ చివరిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు తల్లిగా కనిపించింది. ఆ తర్వాత భర్తతో కలిసి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తోంది.
సినిమాలలో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రియ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యామిలీతో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా సముద్ర తీరంలో ఫోటోలకు పోజులిచ్చింది. భర్త, కూతురు ఉన్నప్పటికీ.. శ్రియ ఈ స్థాయిలో తన అందాలను ప్రదర్శించడంతో ఫ్యాన్స్, నెటిజన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక బీచ్ లో శ్రియషో చూసి గ్లామర్ ప్రియులంతా శ్రియలో డోస్ ఇంకా తగ్గలేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.