తెలుగు ఇండస్ట్రీలో రాజశేఖర్, జీవిత దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం లాంటి చిత్రాల్లో నటించిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో రాజశేఖర్ దంపతుల కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల శివానీ రాజశేఖర్.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’చిత్రంతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఇటీవల జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో హీరో రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ చిత్రంలో ఆయన కూతురుగా నటించింది. నటిగానే కాకుండా ఆమె మోడల్ గా కూడా రాణిస్తుంది. అంతేకాకుండా ఆమె మెడిసన్ పూర్తి చేస్తుంది. ఈ మద్య శివానీ ఫెమినా మిస్ ఇండియా 2022అందాల పోటీలో ఫైనలిస్ట్లలో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. త్వరలో ఈ పోటీకి సంబంధించి గ్రాండ్ ఫినాలేలో తమిళనాడు నుంచి శివానీ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమయె ఈ రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఇన్స్టాగ్రమ్ వేదికగా ప్రకటించింది.
తాను మెడిసన్ చేస్తున్నానని.. ఇటీవల మెడికల్ థియరీ పరీక్షల కారణంగా ఈ కాంటెస్ట్కి సంబంధించిన అనేక భాగాల్లో పాల్గొనలేకపోయినట్లు తెలిపింది. అదే సమయంలో తనకు మలేరియా జ్వరం రావడం వల్ల ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. వీటన్నింటిని ఫేస్ చేసి ఫైనల్లో పాల్గొనాలని ప్రయత్నం చేస్తుండగా.. తన ఎడ్యూకేషన్ కి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీ, ఈ బ్యూటీ కాంటెస్ట్కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే తేదీ.. ఒకే రోజు వచ్చాయని.. ప్రస్తుతం తన చదువుపై ఎక్కువ శ్రద్ద పెడుతున్న కారణంగా ఫైనల్గా బ్యూటీ రేసు నుండి ఆమె వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా వెల్లడించింది.
ప్రస్తుతం శివానీ.. రాజ్ తరుణ్ తో కలిసి జీ5కు ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. శివానీ ఫెమినా మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె సన్నిహితులు, ఫ్యాన్స్ తీవ్ర నిరశకు లోనయ్యారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.