తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సెలబ్రిటీ టాక్ షోలలో ‘ఆలీతో సరదాగా‘ ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల అభిమాన తారలను, ప్రేక్షకులు మర్చిపోయిన సెలబ్రిటీలను, తెర ముందు కనిపించే హీరో హీరోయిన్లను, తెర వెనుక కష్టపడే టెక్నీషియన్లను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.. ఈ ఆలీతో సరదాగా కార్యక్రమం. స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సీనియర్ నటులంతా వస్తున్నారు. వారి లైఫ్ లో, సినీ కెరీర్ లో జరిగిన మంచి విషయాలు, చేదు జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నారు. అయితే.. తాజాగా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ వారం తెలుగులో చాలా సినిమాల్లో మెరిసిన నటి పూర్ణిమ కనిపించనుంది. పూర్ణిమ అసలు పేరు పూర్ణిమ దేవి. మలయాళంలో స్టేజి నేమ్ సుధా అనే పేరు పెట్టినట్లు చెప్పింది.
ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా అన్ని విషయాలు చెప్పిన పూర్ణిమను.. హోస్ట్ ఆలీ “మనిషికో చరిత్ర సినిమా టైంలో మిమ్మల్ని గొల్లపూడి మారుతీరావు గారు కొట్టారంట కదా.. జోక్ గా కొట్టారా? సీరియస్ గా కొట్టారా?” అడిగాడు. ‘నిజంగానే కొట్టారు. నాకు భయమేసింది. పక్కనే మా నాన్న ఉన్నారు.. ఎందుకు కొట్టారు మా అమ్మాయిని? అని అడిగారు. ఆయన నాకు కూతుర్లు లేరమ్మా.. అందుకే కొట్టాను అన్నారు’ అని పూర్ణిమ చెప్పుకొచ్చారు. అలాగే జంధ్యాల గారు నాకు ‘తింగరి’ అని నిక్ నేమ్ పెట్టారని నవ్వేసింది సుధా అలియాస్ పూర్ణిమ. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.