టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు ఖరారు చేస్తూ.. ఇటీవలే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. ఆ పోస్టర్లో విజయ్ స్టైలిష్ లుక్లో.. సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు
కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. మహానటి తర్వాత సామ్, విజయ్ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో కశ్మీర్లో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా షూటింగ్ జరుగుతుండగా విజయ్, సమంతకి గాయలయ్యాయని, ఆ వెంటనే వీరిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Khushi: విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాపై నార్త్ ఆడియెన్స్ ఆగ్రహంగా ఉన్నారా..?
వివరాల ప్రకారం.. ఈ క్రమంలో సమంత, విజయ్లపై కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నారట. సినిమాలో ఇదే అత్యంత ప్రమాదకరమైన సన్నివేశం అని టాక్. సీన్ షూట్లో భాగంగా నదికి రెండువైపులా కట్టిన తాడుపై కారు నడపాల్సిన పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తూ ఆ వాహనం పట్టు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదలో సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరికీ స్పైనల్ కార్ట్కు గాయాలయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరినీ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్రం బృందం నుంచి ఎలాంటి అధికారక ప్రకటన విడుదల కాలేదు. ప్రమాదం జరిగినట్లు తెలియడంతో సామ్, విజయ్ ఫ్యాన్స్ వారికి ఎలాంటి హానీ జరగకూడదని కోరుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నాని – విజయ్ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వార్.. ఆ సినిమానే కారణమా?