హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతని ఎడమ కంటికి, చాతి భాగాన తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో శ్వాస తీసుకోవటంతో కాస్త ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇక ఆయన వెంటనే కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు, యాగాలు చేస్తున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ సమాచారాన్ని ఎప్పటికప్పటికి పవన్ కళ్యాణ్, చిరంజీవి డాక్టర్ల నుంచి తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా డాక్టర్ లు ఇచ్చిన హెల్త్ రిపోర్ట్ ప్రకారం సాయిధరమ్ తేజ్ మెల్ల మెల్లగా స్పృహలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ వార్తతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.