రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఎన్ని రికార్డులను నెలకొల్పిందో మనకి తెలిసిందే. ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ సినిమా ఆస్కార్ బరిలోకి కూడా వెళ్తుందని అనుకున్నారు. అయితే ఆస్కార్ బరిలోకి వెళ్లే క్వాలిటీస్ లేవని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయినా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని, మన తెలుగు హీరోల గొప్పతనాన్ని అమెరికా వాళ్ళ ఆస్కార్ అవార్డు గుర్తిస్తే తప్పితే గుర్తించలేని స్థితిలో ఉన్నామా? అసలు మన అభిమానం ముందు ఆస్కార్ కూడా చిన్నదే. ఈ విషయం పక్కన పెడితే భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అరుదైన ఘనతను ఆర్ఆర్ఆర్ సినిమా సాధించింది.
— Office of LG J&K (@OfficeOfLGJandK) September 18, 2022
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా.. కశ్మీర్ లో సినిమా థియేటర్లకు మాత్రం మొన్నటి వరకూ స్వాతంత్య్రం రాలేదు. 1990 దశకంలో తీవ్ర*వాదం వ్యాప్తి చెందడంతో కశ్మీర్ లో థియేటర్లు మూతబడ్డాయి. మళ్ళీ 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. మొన్న ఆదివారం నాడు కశ్మీర్ లోని సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. జమ్మూ కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. పుల్వామా, పోషియాన్ జిల్లాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రదర్శించారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. మరో స్క్రీనింగ్ లో ‘భాగ్ మిల్ఖా భాగ్’ సినిమాని ప్రదర్శించారు. దీంతో కశ్మీర్ లో ప్రదర్శించబడిన తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు 32 ఏళ్ళ తర్వాత కశ్మీర్ లో ఆడిన తొలి తెలుగు వారి సినిమాగా కూడా చరిత్ర సృష్టించింది. మరి 3 దశాబ్దాల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వడం, అందులో మన టాలీవుడ్ మూవీ ఆడడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.