RRR: కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి మొదలుకొని, ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ వరకూ అన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు సెట్ చేశాయి. అయితే.. ఇండియాలో మొదటగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్, ఫేమ్ అందుకున్న దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి.
ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఈ ఏడాది విడుదలై వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా పీరియాడిక్ మల్టీస్టారర్ గా తెరకెక్కింది. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందించారు.
ఇక విజువల్ వండర్ గా విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాలో తారక్, చరణ్ ల సాహసాలు అందరినీ మెప్పించాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులతో పాటు పాటలు, ఎమోషన్స్ కూడా అదేస్థాయిలో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన వాటిలో ఎన్టీఆర్ ‘కొమురం భీముడో’ ఒకటి. బ్రిటిష్ అధికారుల వద్ద తలవంచుకొని బతుకుతున్న భారతీయుల్లో చైతన్యం కలిగించే సందర్భంలో ఈ పాటను పాడతాడు భీం. అది రాజమౌళి ఇమాజినేషన్. కానీ రియాలిటీలో ఏం చేశారనేది చూస్తే షాక్ అవుతారు.
ఈ పాటలో చరణ్, బ్రిటిషర్స్ తో పాటు వేలమంది జనాలు కనిపిస్తారు. కానీ.. వారందరిని గ్రాఫిక్స్ లో సృష్టించారు దర్శకుడు రాజమౌళి. నాలుగు దారుల కూడలిలో ఏర్పాటు చేసిన గద్దెపై భీం ఉండగా.. చుట్టూ బ్రిటిష్ సామ్రాజ్యం, వేలమంది జనాలు.. ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ లో క్రియేట్ చేశారు. తాజాగా కొమురం భీముడో పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదలైంది. అందులో భీం పాట పాడుతుండగా చుట్టూ వేలమంది జనాలు లేకపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రాఫిక్స్ చూసిన నెటిజన్లు ఎంత మాయ చేశావ్ జక్కన్నా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొమురం భీముడో మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.