తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం ఆయన కొండా దంపతులపై బయోపిక్ ‘కొండా’ మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన అమ్మవారికి నైవేద్యంగా విస్కీని సమర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక్కడ దేవతగా సమ్మకను అందరూ దేవతగా కొలుస్తారు. అలాంటి దేవతకు వర్మ విస్కీ ఆఫర్ చేస్తున్నానంటూ విస్కీ ముందుకు చూపించాదు.. అది కూడా కొండా మురళీ, సురేఖా ఇంట్లోనేనంటూ, వారు కూడా చూస్తున్నారంటూ.. ఫోటో తీస్తున్న చిన్న అమ్మాయి కొండ సినిమా నిర్మాత శ్రేష్ట అని వర్మ చెప్పుకుంటూ వచ్చాడు.
ఇది చదవండి: మోహన్ బాబు రాజకీయాలపై సంచలన నిర్ణయం!
తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర సాగబోతుంది.. ఇందుకు లక్షల్లో భక్తులు తరలి వెళ్తారు. ఇక్కడ దేవతగా సమ్మకను అందరూ దేవతగా కొలుస్తారు. ఇక కొండా దంపతుల జీవిత కథను కొండా అనే టైటిల్తో సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆరంభంలో కూడా వరంగల్లోని మైసమ్మ ఆలయంలో రాంగోపాల్ వర్మ పూజలు చేశారు. ఆలయంలోకి వెళ్లిన రాంగోపాల్ వర్మ అమ్మవారి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి స్వయంగా మందు తాగించి తన మొక్కును చెల్లించుకొన్నారు.
తన షూటింగుకు అంతరాయం కలుగకుండా పూర్తి చేసుకొనేలా ఉండాలని అమ్మవారిని కోరుకొన్నారు. ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ ఏ విషయం లో నేను తగ్గేదే లే అంటూ వస్తున్నారు. వర్మ పోస్ట్ను చూసిన జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నువ్ మహానుభావుడివి అని కొందరు అంటుంటే.. ఇలాంటి పిచ్చి పనులు మాత్రం మానవా? అంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.
Me Offering McDowell’s Whisky to Goddess Sammakka at the KONDA residence while Murali Garu and Surekha Garu are watching ..The little girl taking the pic is Shreshta, the producer of KONDA film 🙏💐🍾 pic.twitter.com/BaC0Fj962Q
— Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2022