గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను, ఆయన తండ్రిని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కండలవీరుడి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. సల్మాన్ ను హత్య చేసేందుకు ముంబైలోని తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసే వాలాను హత్య చేసిన నిందితులే సల్మాన్ హత్యకు స్కెచ్ వేశారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్వయంగా వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద నిందితులు రెక్కీ నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు. సల్మాన్ ఖాన్ టార్గెట్ గా సంపత్ నెహ్రాతో స్కెచ్ వేశారని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. సిద్ధూ మూసే వాలా హత్య కేసులో అరెస్ట్ అయిన కపిల్ పండిట్ ను విచారించగా సల్మాన్ ఖాన్ హత్య కోసం రెక్కీ నిర్వహించినట్లు తెలిసిందని అన్నారు.
Breaking! The three alleged perpetrators who targeted Salman Khan and his father Salim have been arrested in a combined operation by the Delhi Police, Central Agencies and AGTF#SalmanKhan #SalimKhan #Arrested https://t.co/suOR96WX3M
— SpotboyE (@Spotboye) September 12, 2022
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారని, వారందరిలోనూ సల్మాన్ ఖాన్ పెద్ద టార్గెట్ అని నిందితుడు విచారణలో వెల్లడించాడు. ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర 3 రోజుల పాటు రెక్కీ చేసినట్లు తెలిపాడు. 1998లో కృష్ణ జింకను వేటాడిన కేసులో ఇరుక్కున్న సల్మాన్ ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే కృష్ణ జింకలను బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావిస్తుంది. అలాంటి పవిత్రమైన కృష్ణ జింకను వేటాడి చంపితే చంపేస్తామని గతంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించాడు. తాజాగా సల్మాన్ హత్యకు రెక్కీ నిర్వహించినట్లు జైల్లో ఉన్న పండిట్ వెల్లడించడంతో సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచారు. మరి సల్మాన్ హత్యకు రెక్కీ నిర్వహించడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Accused in #SidhuMooseWala murder case conducts recce in #Mumbai to target #SalmanKhan
For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/mfRwSc7wPT
— DNA (@dna) September 11, 2022