గత కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కాంతార’ సినిమా పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమాకి హైలీ పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్లా కాంతార మంచి ఆదరణ సొంతం చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ కూడా నమోదు చేసింది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలను వెనక్కి నెడుతూ.. కాంతార ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లు కొల్లగొట్టింది. కేవలం రూ. 16-20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రూ. 400 కోట్లు వసూల్ చేసి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకి వరాహ రూపం సాంగ్, క్లైమాక్స్ మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అయితే.. కొద్దిరోజుల క్రితం కాంతారలోని ‘వరాహ రూపం..’ పాటకు సంబంధించి ఓ వివాదం జరిగిన విషయం విదితమే. ఈ సినిమాకి ‘వరాహ రూపం’ సాంగ్ చాలా ప్లస్ అయ్యింది. ఈ క్రమంలో వరాహ రూపం పాటను.. తమ ‘నవరసం’ పాట నుండి కాపీ చేశారంటూ కేరళకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు కోర్టులో కేసు వేశారు. ఈ విషయంపై కాంతార చిత్రబృందం అయితే స్పందించలేదు.
దీంతో వరాహ రూపం పాటను ఇకపై సినిమా, యూట్యూబ్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ తో పాటు ఎక్కడా ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉండగా.. కాంతార ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కి అమెజాన్ ప్రైమ్ సంస్థ నవంబర్ 24న స్ట్రీమింగ్ మొదలుపెట్టి గుడ్ న్యూస్ చెప్పింది. కానీ.. ఓటిటిలో కాంతారను చూసిన ప్రేక్షకులంతా తీవ్రనిరాశకు గురవుతున్నారు. కర్ణాటక ఆదివాసీల భూతకోల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించగా.. భూతకోలం ఆడే వ్యక్తిలో పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వరాహ రూపం పాట సినిమాలో ప్లే అవుతుంది.
తాజాగా ఓటిటి విషయానికి వచ్చేసరికి కాంతార క్లైమాక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు వరాహ రూపం సాంగ్ లేకపోవడమే ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్న విషయం. మంచి కథాకథనాలకు తోడు కాంతార సినిమాలో వరాహ రూపం సాంగ్, క్లైమాక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆయువుపట్టుగా నిలిచాయి. అలాంటిది ఇప్పుడు సినిమాలో ఆ సాంగ్ లేకపోవడంతో ఒక్కసారిగా నిరాశకు గురవుతున్నారు ప్రేక్షకులు. మరి కాంతారలో ఎందుకు ఆ సాంగ్, బిజీఎం మార్చేశారు..? అని అంటే.. కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ వారు వేసిన పిటిషన్ కారణం అని సమాచారం. కాగా, ఆ మ్యూజిక్ బ్యాండ్ వారి అనుమతి లేకుండా వరాహ రూపం పాటను కాంతార టీమ్ ఎక్కడ ఉపయోగించకూడదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. సో.. కాంతార ఫ్యాన్స్ ఈ వరాహ రూపం, బిజీఎం విషయంలో అడ్జస్ట్ అవ్వకతప్పదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
#Kantara is now streaming on an #OTT platform without the controversial #VarahaRoopam song. This has evoked mixed response from the audience as many feel the song sets the tone for the climax. Kantara without Varaha Roopam is like… Tell us in the comments below. pic.twitter.com/pJg7TtgCKE
— Bangalore Times (@BangaloreTimes1) November 24, 2022