ఆమె హీరోయిన్ గా సక్సెస్ అయింది. దక్షిణాది వరకే కాదు హిందీలోనూ అడుగుపెట్టింది. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు.. కానీ కెరీర్ ప్రారంభంలో హిట్స్ కొట్టినప్పటికీ ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వాటన్నింటిని నవ్వుతూ భరిస్తూ వచ్చిందే తప్ప ఏనాడు కూడా ఎవరిని ఒక్క మాట అనలేదు. ఇక ఓ హీరోతో పెళ్లికి రెడీ.. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకున్న తర్వాత సొంత అభిమానులే నానా మాటలన్నారు. అప్పుడు కూడా మౌనంగానే ఉంది తప్ప పల్లెత్తు మాట అనలేదు. ఈ మధ్య కాలంలో ఆమె గురించి రకరకాల గాసిప్స్ వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. దీంతో ఇక ఊరుకుంటే లాభం లేదనుకుందో ఏమో గానీ.. వాటన్నింటిపై ఓపెన్ అయింది. తనపై విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఇక విషయానికొస్తే.. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక, తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ చిత్రంలో హీరోగా చేసిన రక్షిత్ శెట్టితో ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఏమైందో తెలియదు గానీ అది బ్రేకప్ అయిపోయింది. ఇక ‘ఛలో’ సినిమాతో తెలుగులోకి వచ్చిన రష్మిక.. ఇక్కడ కూడా హిట్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత యంగ్ హీరోల మూవీస్ లో హీరోయిన్ గా చేసిన రష్మిక.. గతేడాది ‘పుష్ప’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతోంది. ఈ మధ్య కాలంలో రష్మిక-విజయ్ దేవరకొండ రిలేషన్ పైనా పలు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలపై సీరియస్ అవుతూ ఇన్ స్టాలో పెద్ద నోట్ పెట్టింది.
‘గత కొన్నిరోజులు లేదా వారాలు లేదా నెలలు లేదా సంవత్సరాలుగా కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన టైం వచ్చిందనుకుంటున్నాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కానీ కాస్త లేట్ అయింది. నటిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి చాలా ద్వేషానికి గురవుతున్నారు. చాలామంది దారుణమైన ట్రోలింగ్ చేశారు. ఇప్పటికీ అవేవి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించాలని ఏం లేదు కానీ ఇంతలా విమర్శించడంలో మాత్రం అర్థం లేదు. నచ్చకపోతే నచ్చేలేదు అని చెప్పొచ్చు. కానీ ఇలా ట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు ఏం అనుకున్నా సరే మిమ్మల్ని సంతోషపెట్టడమే నాకు తెలుసు. మీరు గర్వపడేలా నటించి, మీ హ్యాపీనెస్ కోసం ఇంకా కష్టపడాలని అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ట్రోల్స్ అడుగడునా వస్తుంటే.. అనుకున్నవి ఎలా సాధిస్తాను’ అని రష్మిక రాసుకొచ్చింది.
‘ఇవన్నీ పట్టించుకోకుండా ఎంత ముందుకు వెళ్లాలి అనుకున్నా సరే.. సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి కలిపి ప్రచారం చేయడం.. దానిపై కొందరు ఆడియెన్స్ ఎగతాళిగా మాట్లాడటం.. పిచ్చిపిచ్చి కామెంట్స్ చేయడం మనసును చాలా బాధపెడుతోంది. నన్ను పనిచేయకుండా నిరుత్సాహపరుస్తున్నారు. నాపై ఎలా ట్రోల్ చేసినా సరే అవి అర్ధవంతంగా ఉంటే.. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అవి వదిలేసి లేనిపోనివి రాసి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంత నీచమైన పనులు ఎలా చేస్తారు అసలు? చాలాకాలంగా భరిస్తూ వచ్చాను. ఇప్పటికైనా స్పందిచకపోతే ఇంకా పెరిగిపోయి ఏమైనా రాసేస్తారు కాబట్టి తప్పక రెస్పాండ్ కావాల్సి వచ్చింది.’ అని హీరోయిన్ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది. తన మనసులో బాధ మొత్తాన్ని బయటపెట్టింది.