సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఓ స్థాయిలోకి వచ్చాక నటీ, నటులు ప్రయోగాల బాట పట్టడం సహజమే. హీరోలు కథల ఎంపికలో మార్పులతో పాటు మల్టీస్టారర్ లు చేయడానికి సిద్దపడుతుంటారు. ఇక హీరోయిన్ లు సైతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలల్లో మెరుస్తుంటారు. అదీకాక భారీ చిత్రాల్లో ఐటెమ్, స్పెషల్ సాంగ్స్ ల్లో చిందులు వేయడానికి రడీగా ఉంటారు. స్టార్ డమ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఆరాటపడుతుంటారు. దానితో పాటు తమ అభిమాన నటుడితో ఆడిపాడలని వారికి సైతం కోరికగా ఉంటుంది. అందులో భాగంగానే వారు ఐటెమ్, స్పెషల్ సాంగ్ లు చేయడానికి ముందుకు వస్తుంటారు. కాజల్, సమంత, శృతిహాసన్ లాంటి మరికొందరు ఇప్పటికే ఐటెమ్ సాంగ్స్ తో దుమ్ములేపారు. తాజాగా ఇదే కోవలోకి చేరబోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రష్మికా మందన్నా.. నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తన అందంతోనే కాకుండా నటనతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తూనే.. మిగతా భాషల్లో సైతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ హాట్ హాట్ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28.ఈ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
అయితే ఈ సాంగ్ ఇప్పటి వరకు వచ్చిన ఐటెమ్ సాంగ్స్ అన్నింటి కంటే అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సాంగ్ ను స్టార్ హీరోయిన్ తో చేయిస్తేనే బాగుంటుందని, అందుకోసంమే రష్మికను అప్రోచ్ అయినట్లు పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ లు ఉండవు. త్రివిక్రమ్ ను ఒప్పించి ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ పెట్టాలని నిర్మాత భావిస్తున్నారు. ఈ సాంగ్ కనుక ఓకే అయితే మహేష్ బాబు సరసన ఆడిపాడనుంది నేషనల్ క్రష్ రష్మిక. అదీకాక ఇంతకు ముందే మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కలిసి నటించడంతో కచ్చితంగా సూపర్ స్టార్ సినిమాలో సాంగ్ చేస్తుందని ఇండస్ట్రీలో గట్టిగి టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ రష్మిక ఈ ఐటెమ్ సాంగ్ లో మెరిస్తే మిగతా ఐటెమ్ సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్స్ సరసన చేరుతుంది. ఇక ప్రస్తుతం పలు వివాదాల్లో నిలుస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉంది. తెలుగు లో ‘పుష్ప-2’ తో పాటుగా హిందీలో ‘మిషన్ మజ్ను’ తమిళంలో దళపతి విజయ్ సరసన ‘వారసుడు’ సినిమాలో మెరవనుంది. ఇక మహేశ్ చిత్రంలో రష్మిక ఐటెమ్ సాంగ్ చేస్తుందన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.