గత కొన్నాళ్లుగా నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ ల ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూ ఇయర్ వేడుకలో భాగంగా నరేష్, పవిత్రా ఇద్దరూ లిప్ కిస్ వీడియోతో అందరికి షాకిచ్చారు. ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయ్యేసరికి.. నరేష్, పవిత్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చేశాయి. వీరి వీడియో చూసిన అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. అయినా.. అవేవి పట్టనట్లుగా ఇద్దరూ ప్రేమపక్షుల్లా ఎక్కడికి వెళ్లినా జంటగా వాలిపోతున్నారు. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. వీరి గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
రీసెంట్ గా నరేష్, పవిత్రల గురించి మాట్లాడేందుకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య రఘుపతి.. పెళ్లికి ముందు నరేష్ ప్రవర్తన, ఇల్లీగల్ ఎఫైర్స్ విషయాలను బయటపెట్టింది. నాలుగు గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయాలను ఇలా మీడియా ముందు చర్చించడం బాధగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇక రమ్య మాట్లాడుతూ.. “నరేష్ పెద్ద దుర్మార్గుడు. నాకు అతనితో మూడో పెళ్లి. అంతకుముందే ఎంతోమందితో ఎఫైర్స్ పెట్టుకున్నాడు. పైగా కొన్నిసార్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. తప్పులన్నీ నరేష్ చేసి.. నాపై ఆరోపణలు చేస్తూ వచ్చాడు. నరేష్ కి సంబంధించి అన్ని ఆధారాలు నాతోనే ఉన్నాయి. అతను కావాలనే నన్ను వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు” అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత నరేష్ ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాను. నరేష్ ని అసలు వదలను.. విడాకులు ఇవ్వను. ఎందుకంటే.. మాకు పదేళ్ల బాబు ఉన్నాడు. వాడు నాన్న కావాలని కూడా అంటున్నాడు. మా విడాకుల కేసు కోర్టులో ఉంది. నరేష్ కి పవిత్ర సమ్మోహనం మూవీ టైంలో పరిచయం అయ్యింది. అప్పుడే తనను ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడు. నేను ఎంతో ఆప్యాయంగా అన్ని మర్యాదలు చేశాను. కానీ.. ఓసారి ఇద్దరూ పార్టీకి వెళ్లారు. అడిగితే అదేం లేదని చెప్పాడు. నరేష్ దగ్గర డబ్బు ఉంది. అందుకే పవిత్ర అతన్ని వదలట్లేదు. ఇక నరేష్ కి కూడా అమ్మాయిలంటే పిచ్చి కాబట్టి.. ఆ విధంగా పవిత్రకి దగ్గరయ్యాడు. నాకు విడాకులు ఇవ్వకుండా వీళ్ళు ఎలా ఒక్కటి అవుతారో చూస్తాను” అంటూ చెప్పుకొచ్చింది రమ్య రఘుపతి. మరి నరేష్ – పవిత్రాల రిలేషన్ షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.