రామ్ గోపాల్ వర్మ..తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనోక విభిన్నమైన దర్శకుడు. వివాదాలకు కేరాఫ్గా మారిన వర్మ సంచలన దర్శకుడిగా పేరు పొందాడు. ఇటు సినిమాల నుంచి అటు రాజకీయం దాకా అన్ని రంగాలైన అంశాలపై స్పందిస్తూ వివాదాస్పదంగా మారుతూ ఉంటాడు. ఇక విభిన్నమైన ఆలోచనలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నాడు వర్మ.
ఇక విషయమేమిటంటే..తాజాగా వర్మను కలిశారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్. ఇక దీనిపై రామ్ గోపాల్ వర్మ పులి, సింహాం, చిరుత తనను కలిసినట్లు ట్విట్ కూడా చేశాడు. ఈ ట్విట్తో పాటు మరో ట్విట్ చేస్తూ నాగార్జున సాగర్ ప్రజలకు ఓ ప్రశ్నను సందించారు. అసలు నోముల్ భగత్ సింహామా..లేక సింహాలకే సింహామా…? అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ నా ప్రశ్నకు నల్గొండ జిల్లా ప్రజలు సమాధానం చెప్పండి ప్లీజ్ అంటూ వర్మ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
దీంట్లో ఎమ్మెల్యే నోముల భగత్ అడవిలో సింహాల వెంట తోక పట్టుకుని నడుస్తూ కనిపిస్తున్నాడు. దీంతో వర్మ ట్విట్కు ఆయన అభిమానులు రీట్విట్ చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ నియోజక వర్గానికి ఈ మధ్య కాలంలో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డిపై 18,872 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.
Ee Nagarjunasagar MLA @bagathnomula
Simhamaa , leka simhaalaki simhamaa? Ee naa prashana Nalgonda zilla Prajalaki…….Samaadhaanam cheppandi please 🙏 pic.twitter.com/T0x8HwyV8M— Ram Gopal Varma (@RGVzoomin) August 6, 2021