తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు.. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే సూపర్ స్టార్ కృష్ణ ఉదయం 4.09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. సోమవారం కృష్ణకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబు సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న సినీ సెలబ్రెటీలు తెలుగు ప్రేక్షకులు, అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి కోట్లమంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఘట్టమనేని కృష్ణ మరణంపై మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సీఎం కేసీఆర్, చంద్రబాబు పలువురు సినీ, రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని ప్రార్థించారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మృతిపై రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. ‘బాధపడాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే స్వర్గంలో కృష్ణ గారు, విజయనిర్మల గారిని కలిసి ఉంటారు.. వారిద్దరూ సంతోషకరమైన సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అంటూ పోస్ట్ చేశారు. దీనితో పాటు కృష్ణ, విజయనిర్మల నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంలోని ఒక పాట వీడియో ట్వీల్ లో జతచేశాడు.
సోమవారం ఆయన తీవ్ర గుండెపోటు, శ్వాసకు సంబంధించిన ఇబ్బంది ఎదుర్కొవడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ఆ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబు, సతీమణి ఇందిర కన్నుమూశారు. ఇప్పుడు ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
No need to feel sad because I am sure that Krishna garu and Vijayanirmalagaru are having a great time in heaven singing and dancing 💐💐💐 https://t.co/md0sOArEeG via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2022