గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన కీలక సూత్రదారి కార్పొరేటర్ కుమారుడేనని పోలీసులు చెబుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ దేశంలో ఏ అంశంపై అయినా సరే తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. తాజాగా ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు.
ఇక్కడ పేద వారికి ఒక న్యాయం.. ఉన్నవారికి ఒక న్యాయం జరుగుతున్నట్టే అనిపిస్తుందని.. గతంలో దిశ కేసులో నింధితులు పేదవారు అయినందున వారి కుటుంబ సభ్యులను బయట ప్రపంచానికి చూపిస్తూ నానా రచ్చ చేశారు, వరుసగా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మరి ఆమ్నేషియా కేసులోని నిందితులను ఎందుకు చూపించరని ప్రశ్నించారు. వారి ముఖాలు కూడా మీడియాలో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో దుబ్బాక ఎమ్మె ల్యే రఘు నందన్ రావు గొంతు ఎత్తక పోతే.. ఇలాంటి కేసు ఎప్పుడో మరుగున పడి ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నాని సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్! ఆ వివాదమేనా ఇద్దరిని కలిపిందా?
ఆమ్నేషియా కేసు విషయంలో యువతికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించడం వల్లే.. ఈ కేసులో పురోగతి లభించిందని పేర్కొన్నారు వర్మ. కానీ ఇక్కడ విచిత్రంగా ఓ ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ప్రశ్నించినందుకు.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పై కేసులు పెడుతున్నారని తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
All those demanding to book a case of section 228a on him are completely silent after 1 question of @RaghunandanraoM ,why a case was not booked on anyone when Disha case accused minors were shown repeatedly on media and multiple interviews were taken of her family members?
— Ram Gopal Varma (@RGVzoomin) June 10, 2022