‘మా’ ఎన్నికలు జూబ్లీహిల్స్లో కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రకాష్రాజ్, మంచు విష్ణు ప్యానల్స్కు చెందిన సభ్యులు అందరూ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారి వారి శిబిరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకునే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎందరో వారివారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వైయడానికి వచ్చిన రామ్ చరణ్ను మంచు విష్ణు ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. అక్కడే ఉన్న మోహన్ బాబును రామ్ చరణ్ పలకరించాడు. మోహన్ బాబు, విష్ణు, రామ్చరణ్ల మధ్య ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. మంచు విష్ణు, రామ్చరణ్ సరదాగా మాట్లాడుకున్నారు.