దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాలకు ఆధ్యుడు అనడంలో సందేహం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాంటిచిన వ్యక్తి రాజమౌళి. రాజమౌళి వేసిన అడుగుతో ప్రస్తుతం వరల్డ్ సినిమాలో పాన్ ఇండియా సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇంక ఇండియన్ సినిమా విషయానికి వస్తే.. సౌత్ సినిమాలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ సినిమా ఓటీటీలోనూ రికార్డులు బద్దలు కొట్టడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరోసారి రాజమౌళిపై కాపీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రిపులార్ సినిమా తారక్- రామ్ చరణ్ నట విశ్వరూపానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో కొమురం భీముడో పాటకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ పాటలో జూనియర్ ఎన్టీఆర్ జీవించాడనే చెప్పాలి. తారక్ ఎమోషన్స్ పండించిన తీరు అందరినీ కట్టిపడేసింది. అయితే ఇప్పుడు ఆ పాట కాపీ అంటూ సోషల్ మీడియాలో రాజమౌళిపై ఆరోపణలు వస్తున్నాయి.
కేవలం ఆరోపణలు మాత్రమే కాదు.. అందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీన్ టూ సీన్ కాపీ కొట్టారంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే నెటిజన్లు కొందరు రిలేటెడ్ సీన్లు బోలెడు ఉంటాయి.. వాటిని చూపించి అంత గొప్ప డైరెక్టర్ ను ట్రోల్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజమౌళిపై వస్తున్న కాపీ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.